సరికొత్త చరిత్ర... రాయదుర్గంలో ఎకరా రూ.237 కోట్లు!
- టీజీఐఐసీ వేలంలో రికార్డు ధర పలికిన ధర
- పాన్ మక్తాలోని సర్వే నెంబర్లోని 6 ఎకరాల 29 గుంటలకు వేలం
- వేలంలో భూమిని దక్కించుకున్న గౌర వెంచర్స్
హైదరాబాద్ నగరంలో భూమి మరోసారి రికార్డు ధర పలికింది. టీజీఐఐసీ వేలంలో ఎకరా భూమి రూ.237 కోట్లు పలికి సరికొత్త రికార్డును సృష్టించింది. రాయదుర్గంలోని పాన్ మక్తాలోని సర్వే నెంబర్ 83/1లో 6 ఎకరాల 29 గుంటలకు వేలం వేశారు. ఈ క్రమంలో టీజీఐఐసీ భూముల వేలానికి అనూహ్య స్పందన లభించింది.
ఈ వేలంలో భూమిని గౌర వెంచర్స్ దక్కించుకుంది. గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఇదే ప్రాంతంలో ఎకరం ధర రూ.177 కోట్లు పలికిన విషయం తెలిసిందే. ఆరోజు 7 ఎకరాలకు రూ.1,357.59 కోట్లు వచ్చింది.
టీజీఐఐసీ వేలం వేసే భూములు మంచి డిమాండ్ ఉంటోంది. సర్వే నెంబర్ 83/1లోని ప్లాట్ 1ఏ, 1ఎఫ్లోని 6.29 ఎకరాలు, ప్లాట్ నెంబర్ పీ4లోని 5.09 ఎకరాలు సహా మొత్తం 11.38 ఎకరాల భూమి వేలానికి నోటిఫికేషన్ వచ్చింది. ఎకరాకు రూ.139 కోట్ల ధరను నిర్ధారించారు. ఈ వేలం ద్వారా రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని టీజీఐఐసీ అంచనా వేస్తోంది. ప్లాట్ నెంబర్ పీ4లోని భూములకు జూన్ 1న ఆన్ లైన్ లో వేలం నిర్వహించనున్నారు.
ఈ వేలంలో భూమిని గౌర వెంచర్స్ దక్కించుకుంది. గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఇదే ప్రాంతంలో ఎకరం ధర రూ.177 కోట్లు పలికిన విషయం తెలిసిందే. ఆరోజు 7 ఎకరాలకు రూ.1,357.59 కోట్లు వచ్చింది.
టీజీఐఐసీ వేలం వేసే భూములు మంచి డిమాండ్ ఉంటోంది. సర్వే నెంబర్ 83/1లోని ప్లాట్ 1ఏ, 1ఎఫ్లోని 6.29 ఎకరాలు, ప్లాట్ నెంబర్ పీ4లోని 5.09 ఎకరాలు సహా మొత్తం 11.38 ఎకరాల భూమి వేలానికి నోటిఫికేషన్ వచ్చింది. ఎకరాకు రూ.139 కోట్ల ధరను నిర్ధారించారు. ఈ వేలం ద్వారా రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని టీజీఐఐసీ అంచనా వేస్తోంది. ప్లాట్ నెంబర్ పీ4లోని భూములకు జూన్ 1న ఆన్ లైన్ లో వేలం నిర్వహించనున్నారు.